Kotha Prabhakar Reddy: గోడ మీద పిల్లిలా రఘునందన్ రావు పరిస్థితి

ABN , First Publish Date - 2023-07-05T16:07:03+05:30 IST

దేశంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Kotha Prabhakar Reddy: గోడ మీద పిల్లిలా రఘునందన్ రావు పరిస్థితి

సిద్దిపేట: దేశంలో బీజేపీని (BJP) గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy)అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీజేపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగుచెందారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అయోమయంగా మారిందని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubbka MLA Raghunandan Rao) పరిస్థితి గోడమీది పిల్లి లాగా తయారైందని ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడ దుంకుతాడో తెలియని అయోమయంలో కార్యకర్తలు ఉన్నారన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి రఘునందన్ రావు పబ్బం గడుపుతున్నారని.. వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. రఘునందన్ టికెట్ కోసం తాపత్రయం పడుతున్నాడే తప్ప ప్రజల బాగోగులు ఆయనకు అవసరం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలన చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-07-05T16:07:03+05:30 IST