KTR: కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి జూఠా మాటలు

ABN , First Publish Date - 2023-01-06T17:12:10+05:30 IST

కాంగ్రెస్‌, బీజేపీ (Congress BJP) నేతలవి జూఠా మాటలని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.

KTR: కాంగ్రెస్‌, బీజేపీ నేతలవి జూఠా మాటలు

సూర్యాపేట: కాంగ్రెస్‌, బీజేపీ (Congress BJP) నేతలవి జూఠా మాటలని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.3.68 లక్షల కోట్ల పన్నులు చెల్లించామని, రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో బీజేపీ చెప్పాలి? అని ప్రశ్నించారు. తాను చెప్పేది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే కిషన్‌రెడ్డి (Kishan Reddy) రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ పార్టీ పేరు మారిందే తప్ప మరేది మారలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-06T17:12:45+05:30 IST