Nama Nageswara Rao : బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే

ABN , First Publish Date - 2023-04-25T12:36:21+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Nama Nageswara Rao : బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే

ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేడు జరిగిన బీఆర్ఎస్ సభలో అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేస్తోందన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందేనన్నారు. పార్లమెంట్‌లో ఏనాడైనా తెలంగాణ కోసం ఈ నేతలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎటువంటి అభివృద్ది చేస్తున్నారో చెప్పగలరా? అని నిలదీశారు. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని... తెలంగాణ అభివృద్ధి చూసి పక్కరాష్ట్రాల ప్రజలు అక్కడి నేతలను నిలదీస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలంతా ఐక్యంగా పనిచేసి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్దానాలు గెలుపొందాలని నామా పేర్కొన్నారు.

Updated Date - 2023-04-25T12:36:21+05:30 IST