Rega Kantharao: ‘పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన సూత్రధారి’

ABN , First Publish Date - 2023-04-05T13:29:33+05:30 IST

తెలంగాణలో పేపర్ లీకేజీ లో బండి సంజయ్ ప్రధాన సూత్రధారి అని మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

Rega Kantharao: ‘పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన సూత్రధారి’

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ (Telangana)లో పేపర్ లీకేజీ (Paper Leakage)లో బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ప్రధాన సూత్రధారి అని మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు (Manuguru MLA Rega Kantha Rao అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం (BJP Government) నికృష్టమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) అధికారంలో ఉంది అది గుర్తు పెట్టుకో బండి అంటూ హెచ్చరించారు. బీజేపీ పార్టీ యువతను నాశనం చేయాలని చూస్తే కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో చూస్తూ ఉరుకోమన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారని.. ఈ విషయంలో ఎవరిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. దేశం మొత్తం కేసీఆర్ (Telangana CM) పాలన కోరుకుంటుందని.. అది చూసి ఓర్వలేని బీజేపీ తెలంగాణలో నికృష్టమైన రాజకీయం చేస్తుందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని బండి సంజయ్ ఈ పేపర్ లీకేజీ చేశారని ఆరోపించారు. దక్షిణాది దేశంలో తమరు సాగిస్తున్న పాలన తెలంగాణలో సాగనివ్వమని రేగా కాంతారావు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-05T13:29:33+05:30 IST