BRS MLA: అహంకారంతో మాట్లాడితే ఊరుకునేది లేదు..జూపల్లి, పొంగులేటిపై రేగా ఫైర్

ABN , First Publish Date - 2023-04-10T14:33:45+05:30 IST

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

BRS MLA: అహంకారంతో మాట్లాడితే ఊరుకునేది లేదు..జూపల్లి, పొంగులేటిపై రేగా ఫైర్

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు (BRS MLA Rega Kantha Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను విమర్శించిన జూపల్లి, పొంగులేటిని అధిష్టానం పార్టీ నుండి సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS)పై విమర్శలు చేయటం వారి అవివేకమన్నారు. మూడో సారి కేసీఆర్ (Telangana CM) ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో ఒకటే ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని... పదవులు అనుభవిస్తూ పార్టీ పిరాయించడం సిగ్గు మాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకుంటు వెళుతున్నారని యెద్దేవా చేశారు. ధనం ఉందని అహంకారంతో మాట్లాడితే ఉరుకునేది లేదని రేగా కాంతారావు హెచ్చరించారు.

Updated Date - 2023-04-10T14:33:45+05:30 IST