Share News

Harish rao: ఈటలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్‌రావు

ABN , First Publish Date - 2023-11-10T17:44:17+05:30 IST

బీజేపీ చేసింది ఏంటో ఈటల రాజేందర్ (Etala Rajender) చెప్పాలి. రాజేందర్ ఢిల్లీ నుంచి లీడర్స్‌ను పట్టుకు వస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు.. తెలంగాణకు ఏమైనా తెస్తున్నారా?, ఈటల రాజేందర్ గెలిచి గాలికి తిరుగుతున్నారు.

Harish rao: ఈటలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీశ్‌రావు

కరీంనగర్: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్‌లో హరీశ్‌రావు (Harish rao) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల టార్గెట్‌గా హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ చేసింది ఏంటో ఈటల రాజేందర్ (Etala Rajender) చెప్పాలి. రాజేందర్ ఢిల్లీ నుంచి లీడర్స్‌ను పట్టుకు వస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు.. తెలంగాణకు ఏమైనా తెస్తున్నారా?, ఈటల రాజేందర్ గెలిచి గాలికి తిరుగుతున్నారు. ఈటలను నమ్మి ఓట్లేస్తే హుజురాబాద్‌‌ను మరిచిపోయారు. ఈటల రాజేందర్‌కు హుజురాబాద్‌లోనే దిక్కు లేదు. పైగా గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తావా?, పెద్దోని మీద పోటీ చేస్తే పెద్దోనివి అవుతావా?, కౌశిక్‌రెడ్డి గెలిస్తే హుజురాబాద్‌ను సిద్దిపేట చేస్తా. పదవుల కోసం ఆత్మ గౌరవం ఎక్కడ పోయింది ఈటలా?, ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) నీకు సలహాదారా?, తెలంగాణ వస్తే అన్నం తినను అన్న పవన్‌‌కల్యాణ్‌తో (Pawan Kalyan) మీకు పొత్తా?.‌‌’’ అంటూ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2023-11-10T17:45:46+05:30 IST