Husnabad: బౌలింగ్ వేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

ABN , First Publish Date - 2023-04-07T13:33:15+05:30 IST

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో

Husnabad: బౌలింగ్ వేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

Karimnagar: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) అపశృతి చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలానికి చెందిన ఆంజనేయులు(37) క్రికెట్ టోర్నమెంట్‎లో బౌలింగ్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యువకడు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం. తొటి ఆటగాళ్లు ఆస్పత్రికి తరలించే క్రమంలో అప్పటికి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-04-07T13:33:15+05:30 IST