YS Vijayalakshmi : ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా?

ABN , First Publish Date - 2023-04-25T11:49:26+05:30 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా?.. ప్రశ్నించే గొంతుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. నేడు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలతో ములాఖాత్ తర్వాత చంచల్ గూడ జైలు వద్ద విజయలక్ష్మి మాట్లాడుతూ..

YS Vijayalakshmi : ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా?

హైదరాబాద్ : ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పా?.. ప్రశ్నించే గొంతుకను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. నేడు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలతో ములాఖాత్ తర్వాత చంచల్ గూడ జైలు వద్ద విజయలక్ష్మి మాట్లాడుతూ.. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం అడుకుంటోందన్నారు. ఈరోజు జైల్లో పెట్టి గొంతు నొక్కేయవచ్చు కానీ షర్మిల మీ మధ్యకి వచ్చి మళ్ళీ పోరాడుతుందని విజయలక్ష్మి అన్నారు. ఇలాంటి నిర్బంధాలకు షర్మిల భయపడదని... బెయిల్ వస్తుందని ఆశిస్తున్నానన్నారు. షర్మిల ఏమైనా ఉద్యమకారిణా? టెర్రరిస్టా? అని ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్స్ కి పర్మిషన్ ఇస్తున్నారని... షర్మిలకి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని విజయలక్ష్మి ప్రశ్నించారు.

Updated Date - 2023-04-25T11:49:26+05:30 IST