Vijayashanti: బీజేపీ ప్రభుత్వంతో సింగరేణికి ఏలాంటి నష్టం ఉండబోదు

ABN , First Publish Date - 2023-04-13T23:24:28+05:30 IST

ప్రతిపక్షాలు(Opposition parties) చెబుతున్నట్లు బీజేపీ( NDA) ప్రభుత్వం వల్ల సింగరేణి(Singareni)కి ఏలాంటి నష్టం ఉండబోదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

Vijayashanti: బీజేపీ ప్రభుత్వంతో సింగరేణికి ఏలాంటి నష్టం ఉండబోదు

హైదరాబాద్(Hyderabad): ప్రతిపక్ష పార్టీలు(Opposition parties) చెబుతున్నట్లు బీజేపీ( NDA) ప్రభుత్వం వల్ల సింగరేణి(Singareni)కి ఏలాంటి నష్టం ఉండబోదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. గురువారం సింగరేణి అంశంపై సోషల్ మీడియా(Social media)లో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు. ఆ వార్తను యథప్రకారం ప్రచురిస్తున్నాం. ‘‘సింగరేణి విషయంలో బీజేపీ కూడా కొంత వ్యతిరేకంగా ఉందని మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను ఎన్నడైనా నా తెలంగాణ(Telangana) ప్రజల పక్షమే... నా లక్ష్యం తెలంగాణ జన సంక్షేమమే. అయితే, నాకు ఏ భిన్నాభిప్రాయం ఉన్నా... క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అది పార్టీలో అంతర్గతంగా తెలియజేస్తా తప్ప, మీడియా ద్వారా కాదు. ఈ విషయంపై గత రెండు రోజుల నుంచీ నన్ను ప్రశ్నలు అడుగుతున్న అందరికీ ఈ బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-04-14T00:00:21+05:30 IST