TS NEWS: మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ABVP నాయకుల ధర్నా

ABN , First Publish Date - 2023-08-29T15:47:18+05:30 IST

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ABVP నాయకులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా మంగళవారం మేడ్చల్(medchal) పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని(Mallareddy camp office) ముట్టడించేందుకు ABVP నాయకుల(ABVP leaders) యత్నించారు.

TS NEWS:  మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ABVP నాయకుల ధర్నా

మేడ్చల్: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ABVP నాయకులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా మంగళవారం మేడ్చల్(medchal) పట్టణంలోని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని(Mallareddy camp office) ముట్టడించేందుకు ABVP నాయకుల(ABVP leaders) యత్నించారు. ఈ సమయంలో నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో విద్యార్థులు గాయపడ్డారు. కొందరు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అలాగే మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా చేపట్టారు.చేతకాని ప్రభుత్వమా గద్దె దిగు అంటూ ఏబీవీపీ నేతలు నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-29T15:47:18+05:30 IST