TS News: గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-05-31T17:15:01+05:30 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు.

TS News: గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. జూన్ 2న ఉదయం 7.00 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తామమని తెలిపారు. జూన్ 3న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం గురించి కార్యక్రమాలను ప్రదర్శిస్తామన్నారు. అలాగే 'ఖిలా ఔర్ కహానీ' పేరుతో పాఠశాల విద్యార్థులకు ఫొటో - పెయింటింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లోనూ నిర్వహించేలా కేంద్రం నిర్ణయించిందన్నారు. ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. 'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్ని చోట్లా జరుపుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నా తెలిపారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయన్నారు.

Updated Date - 2023-05-31T17:15:01+05:30 IST