Hyderabad: ఒంటిపై పెట్రోల్ పోసి కాల్చి చంపినట్లు ఆనవాళ్లు
ABN , First Publish Date - 2023-03-05T12:06:27+05:30 IST
నగరంలో దుండగులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో కన్నుకానరాక ఒకరిపై మరొకరు దాడులకు పాల్పతూ...
హైదరాబాద్: నగరంలో దుండగులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో కన్నుకానరాక ఒకరిపై మరొకరు దాడులకు పాల్పతూ ఏకంగా ప్రాణాలనే తీసేస్తున్నారు. ఈ మధ్య నగరంలో దారుణహత్యలు ఎక్కువయ్యాయి. అలాగే గంజాయి మత్తులో ప్రాణ స్నేహతులనే చంపేస్తున్నారు. ఈ హత్యలు పెరగడానికి కారణం మద్యంతో పాటు గంజాయినే అని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచనలం సృష్టించిన నవీన్ హత్య కేసు నుంచి తెరుకోకముందే తాజాగా మరో దారుణ హత్య చోటుచేసుకుంది. దుండిగల్ సాయినాథ్ సొసైటీలో వ్యక్తి దారుణహత్యకు గురైయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపై పెట్రోల్ పోసి కాల్చి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.