విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి బాలుడు మృతి

ABN , First Publish Date - 2023-04-08T22:03:23+05:30 IST

నగరంలోని చందానగర్‌ (Chandanagar)లో విషాద ఘటన చోటుచేసుకుంది.

విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి బాలుడు మృతి

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌ (Chandanagar)లో విషాద ఘటన చోటుచేసుకుంది. మస్కిటో లిక్విడ్ తాగి బాలుడు మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి తారానగర్‌కి చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ (సంవత్సరంన్నర) ఆడుకుంటూ అనుకోకుండా ఆల్ అవుట్ లిక్విడ్ తాగాడు. బాలుడి బట్టలపై ఆల్ అవుట్ లిక్విడ్ వాసన రావడం‌తో కుటుంబసభ్యులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Updated Date - 2023-04-08T22:03:23+05:30 IST