T.Minister: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం

ABN , First Publish Date - 2023-10-12T14:32:57+05:30 IST

రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది.

T.Minister: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి (Minister Vemual Prashanth reddy)మాతృవియోగం కలిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేముల తల్లి మంజులమ్మ హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మంత్రి వేముల శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు (శుక్రవారం) వారి స్వగ్రామం వేల్పూర్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.


మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు(CM JCR) సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేములకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మంజులమ్మ మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్పీకర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2023-10-12T14:50:03+05:30 IST