KTR: అంబేడ్కర్ జయంతి రోజున కేటీఆర్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-04-14T14:51:24+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఓ వైపు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని..

KTR: అంబేడ్కర్ జయంతి రోజున కేటీఆర్ కీలక ప్రకటన

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి (BR Ambedkar Jayanti) సందర్భంగా ఓ వైపు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనుండగా.. మరోవైపు మంత్రి కేటీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పంజాగుట్ట చౌరస్తాకు అంబేడ్కర్ సర్కిల్ పేరు పెడుతున్నామని ప్రకటించారు. అంబేడ్కర్ లేకుంటే తెలంగాణ లేదని అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని తెలిపారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ నడుస్తోందని అన్నారు. పార్లమెంట్కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ktr-ambedkar.jpg

Updated Date - 2023-04-14T15:22:00+05:30 IST