Share News

TS NEWS: ఆ వార్తలను ఖండించిన తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్

ABN , First Publish Date - 2023-12-09T21:26:22+05:30 IST

శుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలను సనత్‌నగర్ ఎమ్మెల్యే , మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కళ్యాణ్ కుమార్ ఖండించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్యాలయాన్ని మార్చమని కళ్యాణ్ తెలిపారు.

TS NEWS: ఆ వార్తలను ఖండించిన తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్

హైదరాబాద్: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలను సనత్‌నగర్ ఎమ్మెల్యే , మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కళ్యాణ్ కుమార్ ఖండించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్యాలయాన్ని మార్చమని కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వ మార్పిడి ఫర్నిచర్, ఇతర సామగ్రిని సెక్యూరిటీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసాబ్ ట్యాంక్ కార్యాలయానికి తన సిబ్బందితో వెళ్లినట్లు స్పష్టం చేశారు. శాఖాపరమైన ఫైళ్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలలోనే ఉంటాయని తెలిపారు. ఫైళ్లు మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని కళ్యాణ్ చెప్పారు.

Updated Date - 2023-12-10T06:42:58+05:30 IST