Share News

TS NEWS: నాంపల్లి పోలీసుల ఎదుట విచారణకి హాజరైన తలసాని ఓఎస్డీ శ్రీకాంత్

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:23 PM

నాంపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రీకాంత్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నారు.

TS NEWS: నాంపల్లి పోలీసుల ఎదుట విచారణకి హాజరైన తలసాని ఓఎస్డీ  శ్రీకాంత్

హైదరాబాద్: నాంపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రీకాంత్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నారు. వారం రోజుల క్రితం పశుసంవర్థక శాఖలో ఫైల్స్ అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు చేశారు. విచారణ కోసం తమ ఎదుట హాజరుకావాలని నాంపల్లి పోలీసులు ఆదేశించారు. డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన పైల్స్ మిస్సింగ్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:23 PM