Share News

TS NEWS: వైఎస్సార్టీపీ నేత మృతదేహానికి షర్మిల నివాళి

ABN , First Publish Date - 2023-12-01T15:23:46+05:30 IST

వైఎస్సార్టీపీకి చెందిన క్రిస్టియన్ మైనార్టీ సీనియర్ నేత ఫ్రాన్సిస్ పాల్ (37) గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. శుక్రవారం నాడు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

TS NEWS: వైఎస్సార్టీపీ నేత మృతదేహానికి షర్మిల నివాళి

హైదరాబాద్: వైఎస్సార్టీపీకి చెందిన క్రిస్టియన్ మైనార్టీ సీనియర్ నేత ఫ్రాన్సిస్ పాల్ (37) గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. శుక్రవారం నాడు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున మనోధైర్యం కల్పించారు. ఫ్రాన్సిస్ పాల్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఫ్రాన్సిస్ పాల్ వైఎస్సార్టీపీ పార్టీకి ఎంతగానో సేవలు చేశారని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని షర్మిలా తెలిపారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్టీపీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.

Updated Date - 2023-12-01T15:24:02+05:30 IST