Niranjan Reddy: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-07-15T12:14:19+05:30 IST

తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Niranjan Reddy: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్

హైదరాబాద్: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప ప్రజల కోసం వారు మెదల్లకు పనిపెట్టలేదని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల హక్కు అని.. ఇచ్చాము అనడం వారి అహంకారమన్నారు. తెలంగాణ వచ్చింది యూపీఏ.. కాంగ్రెస్‌తో కాదన్నారు. కేసీఆర్‌ వల్లే బషీర్ బాగ్ కాల్పులు జరిగాయని కొందరు చరిత్ర తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనాటి పరిణామాలు అందరికీ తెలుసన్నారు. కరెంట్ నీళ్లు ఇతి వృత్తంగా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. 24గంటల విద్యుత్ సాధ్యం చేసి చూపించామన్నారు. 24 గంటలు రావడం లేదని కొందరు సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి లాగ్ బుక్ చూపిస్తున్నారని.. ఇంట్రప్షన్ లేకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందా? అంటూ నిలదీశారు. కరెంట్ పట్టుకుని కాంగ్రెస్ షాక్‌కు గురైందన్నారు. కరెంట్ సరఫరా మీద కాంగ్రెస్‌కు ఓ విధానం ఉందా? అంటూ నిలదీశారు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-15T12:14:19+05:30 IST