Share News

Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం

ABN , First Publish Date - 2023-10-30T15:50:23+05:30 IST

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమన్నారు.

Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం

హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై (MP Kotha Prabhakar Reddy)హత్యాయత్నాన్ని మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని... ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించామని.. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దన్నారు. అధైర్య పడవద్దని ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-30T15:50:23+05:30 IST