Mallu Ravi: ధరణిపై ఎవరు చెప్పింది నిజం?: మల్లు రవి
ABN , First Publish Date - 2023-06-26T11:09:50+05:30 IST
న్యూఢిల్లీ: నాగర్ కర్నూల్లో నిన్న (ఆదివారం) జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని అన్నారని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధరణిలో మార్పులు చేస్తామని అన్నారని..
న్యూఢిల్లీ: నాగర్ కర్నూల్లో నిన్న (ఆదివారం) జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ (Dharani Portal)ను రద్దు చేస్తామని అన్నారని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ధరణిలో మార్పులు చేస్తామని అన్నారని.. ఈ ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం...ఇద్దరి మధ్య ఏమైనా గొడవ ఉందా...? అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) ద్వారా నిధులు దండుకున్నారని గతంలో ప్రదాని మోదీ (PM Modi), కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)ను జైలుకు పంపిస్తామని గతంలో బండి సంజయ్ కూడా అన్నారని.. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. బండి సంజయ్ పిట్టల దొరల మాటలు మాట్లాడుతున్నారని, కవిత అరెస్ట్ అని అన్నారు, ఫోన్లు ధ్వంసం చేశారని అన్నారు.. ఏమైందని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటేనని మల్లు రవి తీవ్రస్థాయిలో విమర్శించారు.