Share News

Mallareddy: హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

ABN , Publish Date - Dec 19 , 2023 | 01:05 PM

Telangana: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును మల్లారెడ్డి కోరారు.

Mallareddy: హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

హైదరాబాద్: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla reddy) హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును (TS HighCourt) మల్లారెడ్డి కోరారు. గత వారం క్రితం మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 47 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆరోపణపై మల్లారెడ్డితో పాటు 9 మందిపై కేసు నమోదు అయ్యింది. తనను రాజకీయ కక్ష సాధింపుతోనే ఇరికించారని మాజీమంత్రి పిటిషన్‌లో పేర్కొన్నారు. మల్లారెడ్డి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 19 , 2023 | 01:05 PM