Jayasudha : కిషన్‌రెడ్డిని కలిసిన జయసుధ.. బీజేపీలో చేరుతున్నారా?

ABN , First Publish Date - 2023-07-29T09:50:28+05:30 IST

త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం తీవ్ర కలకలం రేపింది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Jayasudha : కిషన్‌రెడ్డిని కలిసిన జయసుధ.. బీజేపీలో చేరుతున్నారా?

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం తీవ్ర కలకలం రేపింది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో కూడా జయసుధ బీజేపీలో చేరుతారంటూ హడావుడి నడిచింది ఆ తరువాత ఏమైందో ఏమో కానీ అంతా సైలెంట్ అయిపోయింది.

గతంలో కూడా జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. జయసుధ 2009లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై అప్పట్లో జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది.

Updated Date - 2023-07-29T09:50:28+05:30 IST