Eatala Rajender: బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్న ఈటల.. ఏం జరుగుతోంది..!

ABN , First Publish Date - 2023-06-10T13:56:53+05:30 IST

తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో

Eatala Rajender: బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్న ఈటల.. ఏం జరుగుతోంది..!
Eatala Rajender

ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో జరుపుతున్న చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా బీజేపీ అగ్ర నేతలతో ఈటల రాజేందర్ (Eatala Rajender) టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నేతలను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను హైకమాండ్‌కు ఈటల వివరిస్తున్నారు. నిన్న (శుక్రవారం) అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ‌తో చర్చలు జరిపారు. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అనంతరం అసోం నుంచీ ఈటల ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీలో పలువురి అగ్రనేతలతో ఈటల చర్చలు జరపనున్నట్లు సమాచారం. త్వరలోనే భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

బండి సంజయ్‌కు కేంద్ర పదవి!

Updated Date - 2023-06-10T13:57:35+05:30 IST