Share News

Congress : కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ

ABN , First Publish Date - 2023-11-01T10:46:22+05:30 IST

కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ జరగనుంది. గత కొద్దిరోజులుగా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్ విధించింది.

Congress : కాంగ్రెస్‌తో  లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ

హైదరాబాద్ : కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై కీలక భేటీ జరగనుంది. గత కొద్దిరోజులుగా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పొత్తు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవటంతో ఒంటరిగా బరిలో ఉండాలని సీపీఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని భావిస్తోంది. సీపీఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు అంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తిలో కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై నేడు ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2023-11-01T10:46:22+05:30 IST