Share News

NCBN: బేగంపేట చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2023-11-01T18:02:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు.

NCBN: బేగంపేట చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. బయటి కొచ్చిన అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన హైదరాబాద్ విచ్చేశారు. బేగంపేటలో తెలుగు తమ్ముళ్లు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో బాబుకు కంటి పరీక్షలు చేయనున్నారు. 52 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత చంద్రబాబు నాయుడు, వైద్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-01T18:15:09+05:30 IST