Share News

Akbaruddin Owaisi: ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-12-09T09:27:53+05:30 IST

Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Akbaruddin Owaisi: ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi as Protem Speaker) ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ (Governor Tamilsai Soundara Rajan) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


మరోవైపు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యే‌లతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే గెలిచిన పత్రం రెండు కాపీల జిరాక్స్, రెండు ఫోటోలు తేవాలని అసెంబ్లీ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా ఎన్నిక వల్ల బీజేపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక నోటిఫకేషన్ వెలువడనుంది.

Updated Date - 2023-12-09T09:29:11+05:30 IST