Share News

Revanth Sabha: ఆలస్యంగా రేవంత్ రెడ్డి సభలు.. కారణమిదే

ABN , First Publish Date - 2023-11-24T15:30:23+05:30 IST

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాల్గననున్న సభలు ఆలస్యంగా మొదలు కానున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రేవంత్ హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్ మార్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరారు. దీంతో సభలు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రేవంత్ నకిరేకల్‌కు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు.

Revanth Sabha: ఆలస్యంగా రేవంత్ రెడ్డి సభలు.. కారణమిదే

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాల్గననున్న సభలు ఆలస్యంగా మొదలు కానున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రేవంత్ హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్ మార్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరారు. దీంతో సభలు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రేవంత్ నకిరేకల్‌కు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. అలాగే సాయంత్రం 6 గంటలకు తుంగతుర్తి, 8 గంటలకు ఆలేరు నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన సభల్లో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈ రోజు కామారెడ్డిలో జరగాల్సిన సభలు రేపటి(శనివారం)కి వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.


కాగా... ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేవంత్ ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగసభ, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగసభ, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు బహిరంగసభ, మధ్యాహ్నం 3:30 గంటలకు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్‌లో రేవంత్ పాల్గొనాల్సి ఉండగా.. హెలికాఫ్టర్ ప్రయాణంలో రుద్దు కావడంతో రోడ్డు మార్గాన బయలుదేరడంతో రేవంత్ సభలు ఆలస్యంగా మొదలుకానున్నాయి.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T15:30:49+05:30 IST