Share News

Jupally Krishna Rao: ప్రజా దర్బార్‌తో ప్రజలకు దగ్గరవుతాం

ABN , First Publish Date - 2023-12-07T16:47:04+05:30 IST

మా నిర్ణయాలు చూసి కేసీఆర్‌కు (KCR) దిమ్మ తిరుగుద్ది. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాం.

Jupally Krishna Rao: ప్రజా దర్బార్‌తో ప్రజలకు దగ్గరవుతాం

హైదరాబాద్: ప్రజా దర్బార్‌తో ప్రజలకు దగ్గరవుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఏబీఎన్‌తో మంత్రి మాట్లాడారు. ‘‘మా నిర్ణయాలు చూసి కేసీఆర్‌కు (KCR) దిమ్మ తిరుగుద్ది. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాం. ప్రజా పాలన మొదలు కాబోతోంది. పాలనను గాడిన పెడతాం. ప్రజలు సమస్య చెప్పుకోవడానికి మొన్నటి వరకు అవకాశమే లేదు. ప్రజలందరూ ఎప్పుడైనా ప్రగతి భవన్‌కు రావచ్చు. కేసీఆర్ అహంకారం పూర్తిగా దించేస్తాం. చేసిన పొరపాట్లకు కేసీఆర్ పశ్చాత్తాపం చెందాలి.’’ అని సూచించారు.

Updated Date - 2023-12-07T16:47:07+05:30 IST