Share News

BJP: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ బండిసంజయ్ భేటీ

ABN , Publish Date - Dec 22 , 2023 | 06:36 PM

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ( Minister Ashwini Vaishnav ) తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandisanjay ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 రోజులు రైలుని నడపాలని విన్నవించారు.

BJP: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ బండిసంజయ్ భేటీ

ఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ( Minister Ashwini Vaishnav ) తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandisanjay ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి 4 రోజులు రైలుని నడపాలని విన్నవించారు. బండి సంజయ్ వినతికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ ఫైనల్ లోకేషన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద ఆయా రైళ్లను నిలిపేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు అశ్వినీ వైష్ణవ్ సూచించారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశించారు.

Updated Date - Dec 22 , 2023 | 06:36 PM