Share News

Congress: సీఎం కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-11-16T22:37:17+05:30 IST

సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఫిర్యాదు చేసింది. బహిరంగ సభల్లో రెవెన్యూ అధికారులపై దుర్బాషలాడారని, అధికారులపై అవినీతి ముద్ర వేశారని ఫిర్యాదు చేసింది.

Congress: సీఎం కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఫిర్యాదు చేసింది. బహిరంగ సభల్లో రెవెన్యూ అధికారులపై దుర్బాషలాడారని, అధికారులపై అవినీతి ముద్ర వేశారని ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషను కట్టడి చేయాలని సీఈఓను కాంగ్రెస్ నాయకులు కోరారు.ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతగా ఉండాలని కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌ని కోరారు.

Updated Date - 2023-11-16T22:37:18+05:30 IST