Share News

TS Election: చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకొనున్న కేసీఆర్

ABN , First Publish Date - 2023-11-29T19:10:32+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్‌లో రేపు చింతమడకకు రానున్నారు.

TS Election: చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకొనున్న కేసీఆర్

సిద్దిపేట జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్‌లో రేపు చింతమడకకు రానున్నారు. చింతమడకలో హెలిప్యాడ్‌ను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. కాగా.. సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్‌లో మంత్రి హరీశ్‌రావు దంపతులు ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (నవంబర్ 30) వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సర్వం సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

Updated Date - 2023-11-29T19:10:34+05:30 IST