Share News

TS ELECTION :వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఘర్షణ. ఒక్కసారిగా ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-11-27T23:46:18+05:30 IST

వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో కార్యాలయంలోకి కాంగ్రెస్ ( Congress ) నాయకులు వచ్చారు.

TS ELECTION :వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఘర్షణ. ఒక్కసారిగా ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో కార్యాలయంలోకి కాంగ్రెస్ ( Congress ) నాయకులు వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల ఘర్షణ పడ్డాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీల నాయకులు వివాదం ముదిరి దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలను సముదాయించి పోలీసులు పంపించి వేశారు.

కాంగ్రెస్ నేతలది మంచి పద్ధతి కాదు

కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేయడం, ధూషించడం మంచి పద్ధతి కాదని వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ ( Metuku Anand ) అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రచారంలో ఉన్న తనను కాంగ్రెస్ నాయకులు ధూషించారన్నారు. దౌర్జన్యంగా మా పార్టీ కార్యాలయంలోకి వచ్చి ధూషించడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఓపిక పట్టామని మెతుకు ఆనంద్ తెలిపారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T00:13:56+05:30 IST