Share News

Telangana Elections: ముమ్మాటికి 70 సీట్లకు పైగా బీఆర్‌ఎస్‌దే గెలుపు

ABN , First Publish Date - 2023-12-02T16:19:46+05:30 IST

Telangana Elections: తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ యే గెలుస్తుందని.. మూడోవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

Telangana Elections: ముమ్మాటికి 70 సీట్లకు పైగా బీఆర్‌ఎస్‌దే గెలుపు

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్(BRS Leader Dasoju Shravan) ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ యే గెలుస్తుందని.. మూడోవ సారి కేసీఆర్ (CM KCR) ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్‌ ది పేగు బంధమని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్‌కు ఎగ్జాక్ట్ పోల్స్‌కు మధ్య చాల తేడా ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు లేఖి తనం చూపిస్తున్నారని విమర్శించారు. చిల్లర ప్రచారం చేస్తున్నారన్నారు. అధికారం లేకుండానే ఇంత లేఖి తనం చూపిస్తున్నారన్నారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-12-02T16:19:48+05:30 IST