Share News

Etela Rajender: నా మొఖం అసెంబ్లీలో కనిపించవద్దని కేసీఆర్ నాపై...

ABN , First Publish Date - 2023-11-23T12:09:28+05:30 IST

Telangana Elections: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

Etela Rajender: నా మొఖం అసెంబ్లీలో కనిపించవద్దని కేసీఆర్ నాపై...

సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (BJP Candidate Etela Rajender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నా మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దని కేసీఅర్ నాపై ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండు. కేసీఆర్‌ (CM KCR) హుజూరాబాద్‌కు వస్తే నీ మొఖం చెల్తదా నా మొఖం చెల్తదో రా అని అంటే రాలేడు కాబట్టి నేనే గజ్వేల్‌కు వచ్చిన’’ అని చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ లీడర్ ఉంటడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటదని దుబ్బాక ప్రజలు నేర్పించారన్నారు. బీజేపీ అధికారం లో వచ్చిన వెంటనే వడ్లకి మద్దతు ధరగా క్వింటాలుకు రూ.3100లు చేస్తామని హామీ ఇచ్చారు. రూపాయి ఖర్చు కాకుండా కార్పొరేట్ వైద్యం అందించే జుమ్మేదారి కోసమే ఓట్లు అడుగుతున్నామని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-23T12:09:29+05:30 IST