Share News

Telangana Elections: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-11-17T12:32:47+05:30 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది.

Telangana Elections: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు

మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్‌పై (Minister Satyavathi Rathod) కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది. మంత్రి రాథోడ్‌పై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-ఈ,171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్ల్యూ 188 ఐఓసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు మండలంలోని కొంగరగిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో మంగళహారతి పట్టిన మహిళల హారతి పళ్లెంలో మంత్రి డబ్బులు పెట్టారు. ఈ అంశంపైనే సత్యవతిపై కేసు నమోదు అయ్యింది. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ జరిపి మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-17T12:40:06+05:30 IST