IND vs WI: మరొక 21 పరుగులు చేస్తే రోహిత్, కోహ్లీ, ధోని సరసన సంజూ శాంసన్

ABN , First Publish Date - 2023-08-03T20:06:39+05:30 IST

టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

IND vs WI: మరొక 21 పరుగులు చేస్తే రోహిత్, కోహ్లీ, ధోని సరసన సంజూ శాంసన్

ట్రినిడాడ్: టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 13వ భారత ఆటగాడిగా శాంసన్ రికార్డు నెలకొల్పుతాడు. ఈ ఘనత సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని వంటి ఆటగాళ్ల సరసన సంజూ శాంసన్ కూడా చేరుతాడు. కాగా గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. దీంతో గురువారం జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లోనే శాంసన్ ఈ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి.

కాగా పొట్టి క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. విరాట్ కోహ్లీ 11,965 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 11,035 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్(9,645), సురేష్ రైనా(8,645), రాబిన్ ఊతప్ప(7,272), ధోని(7,271), దినేష్ కార్తీక్(7,081), కేఎల్ రాహుల్(7,066), మనీష్ పాండే(6,810), సూర్యకుమార్ యాదవ్(6,503), గౌతం గంభీర్(6,402), అంబటి రాయుడు(6,028), సంజూ శాంసన్(5,979) ఉన్నారు.

Updated Date - 2023-08-03T20:06:39+05:30 IST