Share News

Shikar Dhawan: శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:25 PM

టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జొరావర్‌ను ధావన్ కలుసుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవల తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది.

Shikar Dhawan: శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్

టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కొన్నాళ్లుగా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన అతడు వ్యక్తిగత జీవితంలో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జొరావర్‌ను ధావన్ కలుసుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవల తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అవుతోంది.

కొన్నాళ్ల క్రితం కుమారుడితో మాట్లాడిన వీడియోకాల్ ఫోటోను తాజాగా శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు. దానికి ‘నిన్ను చూసి ఏడాదవుతోంది’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన కుమారుడిని తన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. గత మూడు నెలలుగా తన కుమారుడితో మాట్లాడకుండా బ్లాక్ చేశారని ధావన్ ఆరోపించాడు. ఎవరెన్ని చేసినా తన కుమారుడు ఉన్నతంగా ఎదుగుతాడని.. తనను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటానని తన పోస్టులో ధావన్ పేర్కొన్నాడు. దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తామని.. ధైర్యంగా ఉండాలని కుమారుడికి సూచించాడు. ఇతరులతో దయ, సహనం, వినయంతో ఉండాలని కోరాడు. కాగా ధావన్ జాతీయ జట్టుకు దూరమైనా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఐపీఎల్‌లో కూడా ధావన్‌ను కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 04:25 PM