Share News

Rinku Singh: టీమిండియాలో నయా ఫినిషర్.. కోహ్లీ రికార్డును అధిగమిస్తాడా?

ABN , First Publish Date - 2023-11-28T19:58:05+05:30 IST

Team India: ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్‌లలో రింకూ సింగ్ చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్‌లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.

Rinku Singh: టీమిండియాలో నయా ఫినిషర్.. కోహ్లీ రికార్డును అధిగమిస్తాడా?

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడుతున్న యంగ్ టీమిండియాను చూస్తే ఫుల్ లోడ్ చేసిన గన్‌లా కనిపిస్తోంది. కుర్రాళ్లు ప్రత్యర్థిపై బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఫినిషర్ పాత్రలో రింకూ సింగ్ ఆస్ట్రేలియాకు దడ పుట్టిస్తున్నాడు. తొలి టీ20, రెండో టీ20లో అద్భుతంగా ఫినిషింగ్ రోల్‌ను రింకూ సింగ్ పోషించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో సిక్సర్ల వీరుడుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యూపీ డైన‌మైట్.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. విశాఖలో జరిగిన తొలి టీ20లో ఆఖరి బంతికి సిక్సర్ బాది టీమిండియాకు విజయాన్ని అందించిన రింకూ సింగ్.. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 9 బాల్స్‌లో 31 రన్స్ చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. దీంతో ధోనీ మాదిరిగా రింకూ సింగ్ భవిష్యత్ ఫినిషర్‌గా కనిపిస్తు్న్నాడు. ఇప్పుడు అతడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేశాడు.

ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ ఆడింది ఏడు టీ20 మ్యాచ్‌లే అయినా.. నాలుగు ఇన్నింగ్స్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఇందులో మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 128 పరుగులు చేశాడు. ఆడింది నాలుగు ఇన్నింగ్స్‌లే అయినా రింకూ సింగ్ స్ట్రయిక్ రేట్ 344గా నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్‌లలో చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్‌లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో రింకూ సింగ్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ ఫీట్ చెరో రెండుసార్లు సాధించారు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T19:58:06+05:30 IST