IPL 2023: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

ABN , First Publish Date - 2023-04-13T19:19:54+05:30 IST

ఐపీఎల్‌లో మరికాసేపట్లో సమవుజ్జీల మధ్య పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్‌(PBKS)తో జరగనున్న

IPL 2023: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

మొహాలీ: ఐపీఎల్‌లో మరికాసేపట్లో సమవుజ్జీల మధ్య పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్‌(PBKS)తో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్ రెండు విజయాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రింకు సింగ్ (Rinku Singh) బాదుడుకు చిగురుటాకులా వణికిన గుజరాత్‌.. కోల్‌కతాకు విజయాన్ని అప్పగించింది.

ఇక, శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్(Punjab Kings) గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చేతిలో దారుణంగా ఓడింది. రెండు జట్లు గత మ్యాచుల్లో ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముందడుగు వేయాలని భావిస్తున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు చెరో మూడు మ్యాచ్‌లు రెండేసి విజయాలు సాధించాయి. అయితే, రన్‌రేట్ పరంగా చూస్తే పంజాబ్ కంటే గుజరాత్ రెండు స్థానాల పైన ఉంది.

పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. నాథన్ స్థానంలో రబడ, రజా స్థానంలో భానుక జట్టులోకి వచ్చారు. 2018 నుంచి ఇప్పటి వరకు పంజాబ్ జట్టు మొహాలీలో 11 మ్యాచ్‌లు ఆడగా అందులో 9 మ్యాచుల్లో విజయం సాధించింది. మరి ఆ రికార్డును కొనసాగిస్తుందో, లేదో చూడాలి.

Updated Date - 2023-04-13T19:20:38+05:30 IST