Share News

Viral Video: ప్రత్యర్థుల్లా మారిన ధోనీ-పంత్.. వైరల్ అవుతున్న వీడియో

ABN , Publish Date - Dec 20 , 2023 | 09:12 PM

Viral Video: ఐపీఎల్ వేలం ముగిసిన అనంతరం రిషబ్ పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. వీళ్లిద్దరూ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో డబుల్స్ ఆడారు. ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు.

Viral Video: ప్రత్యర్థుల్లా మారిన ధోనీ-పంత్.. వైరల్ అవుతున్న వీడియో

టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాది నుంచి మైదానంలోకి దిగలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతడు ఇటీవల ఐపీఎల్ వేలంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వేలంలో పాల్గొని కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేలా తమ ఫ్రాంచైజీకి సూచనలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ద్వారా బరిలోకి దిగి జాతీయ జట్టుకు కూడా ఎంపిక కావాలని రిషబ్ పంత్ లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో తలపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా ఐపీఎల్ వేలం ముగిసిన అనంతరం రిషబ్ పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. వీళ్లిద్దరూ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో డబుల్స్ ఆడారు. ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో తలపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ధోనీపై పంత్ బలంగా ఓ షాట్ కొట్టాడు. దాంతో మ్యాచ్‌ను చూస్తున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా కేకలు వేయడంతో పంత్ నవ్వుతూ బదులివ్వడం గమనించాల్సిన విషయం.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 09:12 PM