Share News

India- Australia Match: విశాఖలో వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియాల మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ

ABN , First Publish Date - 2023-10-17T21:39:15+05:30 IST

క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 23వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియాల ( India- Australia Match ) మధ్య జరగనున్న మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం.

India- Australia  Match: విశాఖలో వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియాల మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ

విశాఖపట్నం: క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 23వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియాల ( India- Australia Match ) మధ్య జరగనున్న మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. వైఎస్‌ఆర్‌ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సమావేశం అయింది. ఈసమావేశానికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున, సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీఏ సెక్రటరీ గోపినాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ ఏడాదిలో జరగబోయేది మూడో మ్యాచ్. గత మ్యాచ్‌లల్లో చోటు చేసుకున్న లోటుపాట్లపై చర్చించాం. అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్‌లను, సెక్రెటరీలకు ఆహ్వానం ఇస్తాం. స్టేడియంలో 27 వేల మందికి కెపాసిటీ ఉంటుంది. విశాఖపట్నంలో బీచ్ రోడ్డులో 10 వేల మంది వీక్షించేందుకు ఐపీఎల్ తరహా ఫ్యాన్ పార్క్స్, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసే ఏర్పాట్లు చేస్తాం. ఆన్‌లైన్, ఆప్‌లైన్ లో టికెట్స్ అందుబాటులో ఉంటాయి’’ అని ఏసీఏ సెక్రటరీ గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున

ఆస్ట్రేలియా Vs ఇండియా T- 20 మ్యాచ్ నిర్వహణకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున మాట్లాడుతూ... ప్లేయర్స్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్‌పై అందరి ఎక్స్‌పేటేషన్స్ రీచ్ అయ్యేలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మల్లిఖార్జున అన్నారు.

పూర్తి స్థాయిలో అందుబాటులో పోలీస్ యంత్రాంగం: సీపీ రవి శంకర్ అయ్యర్

మ్యాచ్ డే రోజు పార్కింగ్, ట్రాఫిక్‌లపై పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు. ఈసందర్భంగా సీపీ రవి శంకర్ అయ్యర్ మాట్లాడుతూ... ఫ్యాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రత నడుమ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. 2 వేల మంది వరకు పోలీసులు విధుల్లో పాల్గొంటారని సీపీ రవి శంకర్ అయ్యర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T21:39:15+05:30 IST