Wife: నీ భార్యను చంపేసెయ్.. లేదంటే ఆమే నిన్ను చంపేస్తుంది.. కలలో ఆ భర్తకు ఎవరో చెప్పిన మాటలివీ.. చివరకు అతడేం చేశాడంటే..

ABN , First Publish Date - 2023-04-02T17:48:48+05:30 IST

కలలో కనిపించిన విషయం నిజమవుతుందేమోనని భావించి..

Wife: నీ భార్యను చంపేసెయ్.. లేదంటే ఆమే నిన్ను చంపేస్తుంది.. కలలో ఆ భర్తకు ఎవరో చెప్పిన మాటలివీ.. చివరకు అతడేం చేశాడంటే..

చాలామంది కలలను నమ్ముతారు. తమ కలలో కనిపించే సంఘటనలు ఏవైనా నిజజీవితంలో జరుగుతాయని అనుకుంటారు. ఓ వ్యక్తికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో కల వచ్చింది. నువ్వు నీ భార్యను చంపేసెయ్.. లేకపోతే ఆమె నిన్ను చంపేస్తుందని కలలో ఎవరో అతనితో చెప్పారు. ఆ తరువాత అతనికి మెలకువ వచ్చింది.తనకు కలలో కనిపించిన విషయం నిజమవుతుందేమో.. తన భార్య తనను చంపేస్తుందేమో అనుకున్నాడు. ఆ తరువాత అతను దారుణానికి పాల్పడ్డాడు. అందరినీ ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జార్ఖాండ్(Jharkhand) రాష్ట్రం రాంచీ(Ranchi)లో ఓ వింత హత్య(Murder) వెలుగులోకి వచ్చింది. జార్ఖాండ్ లో హుమ్తా(Humta) పంచాయితీ పరిధిలో గిరిదిహ్ గ్రామంలో పుష్వా ముండా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి 2012లో సోన్మతీదేవీ అనే మహిళతో వివహం జరిగింది. పెళ్ళయినప్పటి నుండి వీరు బానే ఉండేవారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా కలిగారు. ఒకరోజు కుటుంబమంతా కలసి రాత్రి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో పుష్వాకు కల వచ్చింది. కలలో ఎవరో అతనితో మాట్లాడారు. 'నువ్వు నీ భార్యను చంపేసెయ్.. లేకపోతే ఆమె నిన్ను చంపేస్తుంది' అంటూ ఓ వ్యక్తి కలలో చెప్పారు. ఆ తరువాత పుష్వా కు మెలకువ వచ్చింది. అతని ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. అయోమయంలో పడిపోయాడు.

'నా భార్య నిజంగానే నన్ను చంపేస్తుందేమో..' అని భయపడ్డాడు. అతను అలా భయపడగానే పక్కనే నిద్రోపోతున్న భార్య గొంతు పట్టుకున్నాడు. ఉన్నట్టుండి తన గొంతు నులుముతున్నది ఎవరో ఆమెకు అర్థం కాలేదు. ఆమె అరుస్తూ, పెనుగులాడుతుండటంతో నిద్రపోతున్న ముగ్గురు పిల్లలకు మెలకువ వచ్చింది. వాళ్ళ తండ్రి చేస్తున్న పనికి భయపడి ఏడుస్తూ ఇంటి తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినబడేసరికి ఇరుగు పొరుగు వారు బయటకు వచ్చారు. ఏం జరిగిందని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు విషయం మొత్తం అందరికీ చెప్పేసరికి వారు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే పుష్వా భయపడి తలుపులు వేసుకున్నాడు. తరువాత ఇరుగుపొరుగు వారు తలుపులను బద్దలుకొట్టి చూడగా.. పుష్వా ముండా తన భార్య మృతదేహం మీద కూర్చుని కనిపించాడు. అది చూసి ఇరుగుపొరుగు వారు భయపడిపోయారు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య తనను చంపేస్తుందనే భయంతోనే తను తన భార్యను హత్య చేసినట్టు పోలీసుల ముందు చెప్పాడు. కాగా ముగ్గురు పిల్లలను కూడా చంపాలని అనుకున్నట్టు అతని సోదరుడే పోలీసులకు తెలిపాడు. తల్లి చనిపోయి, తండ్రి కటాకటాలపాలవడంతో ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Read also: Funny Video: సైకిల్ బాగుందని ఒకరి తర్వాత మరొకరు కొట్టేద్దామని ట్రై చేశారు.. ఎక్కి కూర్చున్న మరుక్షణమే మైండ్‌బ్లాకయ్యే పరిణామం..


Updated Date - 2023-04-02T17:48:48+05:30 IST