Wife: ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్న 3 నెలల కూతురు.. మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ దిగాలుగా కూర్చున్న 8 ఏళ్ల కొడుకును ఆ తండ్రి అడిగితే..

ABN , First Publish Date - 2023-05-19T16:17:48+05:30 IST

ఇంట్లో 3నెలల కూతురు గుక్కపట్టి ఏడుస్తోంటే పాపను ఎత్తుకుని భార్యకోసం ఇల్లంతా వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి దిగులుగా ఉన్న 8ఏళ్ళకొడుకును అడిగాడు. కొడుకు చెప్పింది వినగానే..

Wife: ఇంట్లో గుక్కపట్టి ఏడుస్తున్న 3 నెలల కూతురు.. మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ దిగాలుగా కూర్చున్న 8 ఏళ్ల కొడుకును ఆ తండ్రి అడిగితే..

బయటకు వెళ్ళి పని ముగించుకుని ఇంటికి వెళ్లాడు ఏ వ్యక్తి. ఇంట్లో 3నెలల కూతురు గుక్కపట్టి ఏడుస్తోంది. పాప ఇంతగా ఏడుస్తోంటే పట్టించుకోకుండా ఏం చేస్తోంది అని తన భార్య కోసం అటూ ఇటూ చూశాడు అతను. ఆమె ఎక్కడా కనిపించలేదు. కొంచెం దూరంలో దిగులుగా కూర్చున్న 8ఏళ్ల కొడుకు దగ్గరకు వెళ్లాడు. 'మీ అమ్మ ఎక్కడికెళ్ళింది నాన్నా? చెల్లి అంతగా ఏడుస్తోందిగా నువ్వైనా బుజ్జగించకూడదా?' అన్నాడు ఏడుస్తున్న కూతురిని బుజ్జగిస్తూ. అప్పుడే 8ఏళ్ల ఆ పిల్లాడు తండ్రి కాళ్లను చుట్టేసి కన్నీరు మున్నీరయ్యాడు. జరిగిన విషయం తండ్రికి చెప్పాడు. కొడుకు చెప్పింది విని అతను షాకయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

బీహార్(Bihar) రాష్ట్రం జహాన్ పూర్ గ్రామంలో శివరామ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను భార్య దేవి, 8ఏళ్ల కొడుకు, 3నెలల కూతరుతో కలిసి ఉంటున్నాడు. ఇతను కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈక్రమంలో అతను ఓ పెళ్ళిలో పని(work in marriage) ఉండటంతో వెళ్లాడు. శివరామ్ ఇంట్లో లేని సమయంలో పక్కింట్లో నివసించే ఇద్దరు వ్యక్తులు(neighbours) దేవి ఇంట్లోకి చొరబడ్డారు. వాళ్ళిద్దరూ మద్యం సేవించి ఉండటంతో(drinking alcohol) వారేం చేస్తున్నారో వారికి అర్థం కావడంలేదు. ఈక్రమంలో వారిద్దరూ దేవిని పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి(empty room) తీసుకెళ్ళి ఆమెను అత్యాచారం(women raped) చేశారు. ఆమె గట్టిగా కేకలు వేయబోతే దారుణంగా కొట్టి చంపేశారు(beaten and murdered).శవాన్ని వాళ్ళతోనే తీసుకుని వెళ్లిపోయారు. 8ఏళ్ల పసివాడి ముందే ఇదంతా జరగడంతో ఆ పిల్లాడు భయపడిపోయాడు.

Viral News: ఈ మహిళది కదా అదృష్టమంటే.. రూ.660 పెట్టి ఓ షాపులో కొని.. అసలు అదేంటో తెలిసి రూ.33 లక్షలకు మళ్లీ అమ్మేసింది..!


పనికి వెళ్లన శివరాం పని ముగిసిన తరువాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో 3నెలల కూతురు గుక్కపట్టి ఏడుస్తోంటే పాపను ఎత్తుకుని భార్యకోసం ఇల్లంతా వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ ఇంట్లోనే ఉండటంతో 'పిల్లల్ని, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా?' అని కంగారు పడ్డాడు. అప్పుడే ఓ వైపు దిగాలుగా కూర్చుని తన 8ఏళ్ల కొడుకు కనిపించాడు. 'ఒరేయ్ చిన్నా ఎందుకిలా కూర్చున్నావు? మీ అమ్మ ఎక్కడికెళ్ళింది?' అని అడిగాడు. తండ్రి కనబడేసరికి ఆ పిల్లాడికి దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే తండ్రి కాళ్లను చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చాడు. తన కళ్ళముందే జరిగింది మొత్తం చెప్పాడు. కొడుకు అంతా చెప్పడంతో శివరామ్ రక్తం మరిగిపోయింది. అతను వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగింది మొత్తం చెప్పాడు. పోలీసులు దేవి మృతదేహం కోసం, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డున వాకింగ్ కోసం వెళ్ళిన వారికి ఒడ్డున ఇసుకలో నుండి ఓ స్త్రీ చెయ్యి బయటకు కనిపించింది(women hand found on river bank). దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతంలో తవ్వి చూడగా అది దేవి మృతదేహం అని తెలిసింది. పోలీసులు నిందితులిద్దరీ పట్టుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Old Woman: జిల్లా మేజిస్ట్రేట్‌ ఆఫీసులో 77 ఏళ్ల వృద్ధురాలు.. చేతిలో ఓ కాగితం.. దీనంగా అందరివైపూ చూపులు.. అసలేమైందని అడిగితే..!


Updated Date - 2023-05-19T16:19:16+05:30 IST