Viral Video: పాకిస్తాన్ మరీ ఇంత దారుణంగా తయారయ్యిందేంటి? అరటి పళ్ళు అమ్ముకోడానికి ఓ చిన్న పిల్లాడు రహదారిమీదకు వస్తే ప్రజలంతా ఏం చేశారో చూడండి..

ABN , First Publish Date - 2023-05-09T13:52:03+05:30 IST

అరటిపళ్లు అమ్ముకోవడానికి ఓ పిల్లాడు రహదారిమీదకు రాగానే అక్కడి ప్రజలంతా చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు

Viral Video:  పాకిస్తాన్ మరీ ఇంత దారుణంగా తయారయ్యిందేంటి? అరటి పళ్ళు అమ్ముకోడానికి ఓ చిన్న పిల్లాడు రహదారిమీదకు వస్తే ప్రజలంతా ఏం చేశారో చూడండి..

గత కొన్ని నెలలనుండి పాకిస్తాన్ లో ఏర్పడిన పరిస్థితుల గురించి వింటూనే ఉన్నాం. అక్కడ ఆహారపదార్థాల దగ్గర నుండి పెట్రోలు వరకు ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సగటు పౌరుడు బ్రతకడం కష్టంగా మారింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఎన్నో వీడియోస్ బయటకొస్తున్నాయి. కొన్ని వీడియోస్ చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకొచ్చింది. అరటిపళ్లు అమ్ముకోవడానికి ఓ పిల్లాడు రహదారిమీదకు రాగానే అక్కడి ప్రజలంతా చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సంక్షోభం ఉన్న దేశాలలో నివసించే ఎంతో మంది ప్రజలు వాటికి బాధితులుగా మారతారు. శ్రీలంక(Sri Lanka) ఇక్కట్లు తెలిసిన తరువాత పొరుగుదైశమైన పాకిస్తాన్(Pakistan) లో ఏర్పడిన సంక్షోభం ప్రపంచమంతా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ఉంటోంది. దానికి తగ్గట్టు అక్కడ జరిగే కొన్ని సంఘటనలు వీడియోల(videos) రూపంలో బయటపడుతుండటంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఒక వీడియో అలాగే బయటకొచ్చింది. ఓ పిల్లాడు(boy) గాడిదతో బండి(cart with donkey) కట్టి ఆ బండిమీద కొన్ని అరటిపండ్లు(bananas) పెట్టుకుని మార్కెట్ లో అమ్మాలని వచ్చాడు(selling in market). పిల్లాడిని చూడగానే అక్కడున్న జనం ఆ పిల్లాడి బండి చుట్టూ చేరారు. వాళ్లలో ఒకరిద్దరు వ్యక్తులు పిల్లాడితో ఏదో మాట్లాడుతూ పిల్లాడు ముందుకు వెళ్లకుండా ఆపారు. ఇంతలోనే అక్కడున్న వాళ్లలో ఒకరిద్దరు బండిలో ఉన్న అరటిపళ్లు తీసుకుని పారిపోయారు. వారు అలా చేయడంతో అక్కడున్న మిగిలినవారు అదేవిధంగా బండిలో అరటిపళ్ళు తీసుకుని పారిపోవడం మొదలుపెట్టారు. పాపం ఆ పిల్లాడు ఏడుస్తూ తన పళ్లను అలా తీసుకెళ్లొద్దని వారిని దీనంగా వేడుకున్నాడు(boy crying and request). అయినా పిల్లాడి ఏడుపును ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఆ పిల్లాడు తన గాడిదను చరిచి, అక్కడినుండి వెళ్లిపోవడానికి బండిని ముందుకు నడిపించాడు. కానీ ప్రజలు మాత్రం నడుస్తున్న బండి నుండే పళ్లు దోచుకున్నారు. అది గాడిద బండి కావడంతో మరీ వేగంగా వెళ్ళలేకపోయింది. దీంతో ఆ పిల్లాడు చాలా పళ్లను పోగొట్టుకున్నాడు.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


Crazy Clips అనే ట్విట్టర్ అకౌంట్ నుండి వీడియోను షేర్ చేశారు. 'పాకిస్తాన్ లో ప్రజలు.. గాడిద బండిపై అరటిపండ్లు అమ్ముతున్న చిన్నారి నుండి అరటిపండ్లు దొచుకున్నారు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'పాపం ఆ పిల్లాడికి ఎవరూ సహాయం చేయలేదా?' అని విచారం వ్యక్తం చేస్తున్నారు. 'పాకిస్తాన్ లో ప్రజలు ఆకలితో పోరాడుతున్నారు, అందుకే వారు ఇప్పుడు దోచుకుంటున్నారు' అని మరొకరు కామెంట్ చేశారు. 'పాకిస్తాన్ పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారైందా?' అని ఆశ్చర్యపోతున్నారు.

Viral News: నెలరోజులుగా దగ్గు వస్తున్నా నిర్లక్ష్యం చేశాడు.. చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్ళి స్కానింగ్ తీయిస్తే అందులో కనిపించిందేంటో చూసి..


Updated Date - 2023-05-09T13:52:03+05:30 IST