Viral News: మురికి కాల్వలో ఓ యువతి మృతదేహం.. జేసీబీతో పూడిక తీస్తోంటే షాకింగ్ దృశ్యం.. ఏడాది క్రితమే చనిపోయిందని రిపోర్టులు రావడంతో..

ABN , First Publish Date - 2023-05-02T18:46:29+05:30 IST

జేసీబీతో కాలువలో పూడిక పైకి తీయగా అందులోనుండి దారుణమైన స్థితిలో ఓ యువతి మృతదేహం బయటపడింది

Viral News: మురికి కాల్వలో ఓ యువతి మృతదేహం.. జేసీబీతో పూడిక తీస్తోంటే షాకింగ్ దృశ్యం.. ఏడాది క్రితమే చనిపోయిందని రిపోర్టులు రావడంతో..

మురికికాల్వల ప్రక్షాళన నిర్వహించే పనిలో భాగంగా మున్సిపాలిటీ వారు ఓ వీధిలో జేసీబీ సహాయంతో పూడిక తీస్తున్నారు. జేసీబీతో కాలువలో పూడిక పైకి తీయగా అందులోనుండి దారుణమైన స్థితిలో ఓ యువతి మృతదేహం బయటపడింది. మున్సిపాలిటీ వారు యువతి మృతదేహాన్ని చూసి విస్తుపోయారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపగా.. ఆ యువతి ఏడాదికిందటే చనిపోయిందనే విషయం బయటపడింది. ఈ కేసు గురించి పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. యువతి మర్డర్ మిస్టరీ గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్(Indore) లో ఓ వీధిలో మున్సిపాలిటీ వారు మురికికాల్వల(drainage system) ప్రక్షాళన చేపట్టారు. ఆ సమయంలో జేసీబీ(JCB) సహాయంతో మురికి కాల్వలో పూడిక తీయగా ఓ యువతి మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని చూసి మున్సిపాలిటీ వారు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపగా ఆమె ఏడాది కిందటే చనిపోయనట్టు తెలిసింది. అప్పటినుండి పోలీసులు ఆ యువతి మృతి వెనుక గల కారణాలు కనిపెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ దశలో పోలీసులకు ఆ యువతి ఇండోర్ లోని హీరానగర్ లో 2020, మే 6వ తేదీన తప్పిపోయిన అర్చనగా తెలిసింది. అర్చన గురించి విచారణ చేపట్టిన పోలీసులకు ఇండోర్ లోనే నివసించే విశాల్ అనే వ్యక్తికి, అర్చనకు మధ్య ప్రేమ వ్యవహారం(love affair) సాగినట్టు తెలిసింది. విశాల్ కోసం పోలీసులు వెతగ్గా అతను కనిపించలేదు. దీంతో పోలీసులు విశాల్ కు ఎంతో నమ్మకమైన ఇద్దరు స్నేహితులను పట్టుకుని వారిని విచారించారు. విచారణలో వారిద్దరూ చాలా దారుణమైన విషయాలు బయటపెట్టారు.

Crime News: వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఆపి కారులో ఏమున్నాయా అని వెతికితే..


అప్పటికే పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్న విశాల్.. అర్చనను ప్రేమించాడు. కరోనా సమయంలో అర్చన తనను పెళ్లి చేసుకోమని(forsed for marriage) విశాల్ ను తరచుగా వేధించడం మొదలుపెట్టింది. ఆమె చర్యతో విసిగిపోయిన విశాల్ తన భార్య లేని సమయం చూసి ఆమెను తన ఇంటికి రమ్మని చెప్పాడు. విశాల్ ఇంటికి చేరుకున్న అర్చన అక్కడ కూడా పెళ్లిగురించి గొడవ చేసింది. ఈ క్రమంలో విశాల్ అర్చన చున్నీతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. హత్య తరువాత అతను తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సత్యనారాయణ, శివవానంద్ లను పిలిచాడు. తను అర్చనను చంపేసిన విషయం చెప్పి ఆమె హత్య బయటపడకుండా ఉండే మార్గం గురించి చర్చించాడు. ముగ్గురు మాట్లాడుకుని విశాల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న గట్టర్ ఛాంబర్ లో అర్చన మృతదేహాన్ని ఉంచి, మృతదేహం పైన ఉప్పుతో నింపేసి, దానిమీద దుప్పటి కప్పారు. తరువాత ఛాంబర్ క్లోజ్ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా అర్చన మృతదేహం కరిగిపోవాలన్నది వారి ప్లాన్. అయితే మురుగు కాల్వల ప్రక్షాళన కారణంగా విశాల్ ఇంటివెనుక ఉన్న గట్టర్ ఛాంబర్ ను పగలగొట్టడంతో విషయం బయటపడింది. విశాల్ భార్యకు అర్చనతో సంబంధం తెలిసిన కారణంగానే అర్చనను హత్యచేసినట్టు అతని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారం చేసే విశాల్ గతంలో కూడా జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం విశాల్ పరారీలో ఉన్నాడని, తొందరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Viral Video: పెళ్లి వేడుకల్లో ఓ వధువుకు ఊహించని షాక్.. అప్పటిదాకా పక్కన కూర్చున్న వరుడు సడన్‌గా లేచి వెళ్లిపోయి..!


Updated Date - 2023-05-02T18:46:29+05:30 IST