Share News

Shocking: ఎన్నిసార్లు ఫోన్ చేసినా బయటకు రావడం లేదని.. అసలు ఆమెకు ఇల్లే లేకుండా చేసిన ప్రియుడు.. బాంబులేసి కూల్చేశాడు..!

ABN , First Publish Date - 2023-10-18T09:54:42+05:30 IST

ప్రేమ హద్దులు దాటితే అది పైశాచికానికి దారితీస్తుంది. ప్రియురాలు తనను కలవలేదనే కోపంతో ఇంటిమీద ఏకంగా బాంబు విసిరాడు.

Shocking: ఎన్నిసార్లు ఫోన్ చేసినా బయటకు రావడం లేదని.. అసలు ఆమెకు ఇల్లే లేకుండా చేసిన ప్రియుడు.. బాంబులేసి కూల్చేశాడు..!

ప్రేమ చాలా గొప్పదని అంటారు. కానీ ప్రేమ హద్దులు దాటితే అది పైశాచికానికి దారితీస్తుంది. ఓ వ్యక్తి తను ప్రేమించిన మహిళను కలవడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు. ఆమెకు పదేపదే ఫోన్ చేసి ఇంటి నుండి బయటకు రావాలని కూడా సూచించాడు కానీ ఆమె బయటకు రాకపోవడంతో ఏకంగా బాంబు వేసి ఆమె ఇంటిని కూల్చేశాడు. ఈ వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'ఇదేం ప్రేమరా నాయనా.. ఏకంగా ఇల్లు కూల్చేయడమేంటి?' అని విస్తుపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. అమృతలాల్ అనే వ్యక్తి తను ప్రేమించిన మహిళ ఇంటిమీదనే బాంబు దాడి చేసి ఇంటిని కూల్చేశాడు. రాజస్థాన్ రాష్ట్రం దోన్డా పోలిస్ స్టేషన్ పరిథిలో అమృతలాల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళకు పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. అమృతలాల్, సదరు మహిళ ఇద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు. ఎప్పటిలాగే తనను కలవాలని అమృతలాల్ ఆమెకు చెప్పాడు. కానీ ఆమె కుటుంబ కారణంగా అతన్ని కలవలేదు. ఆమె ఎందుకు కలవలేదో అర్థంకాక అమృతలాల్ ఆమెకు చాలాసార్లు ఫోన్ కూడా చేశాడు. కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో విసిగిపోయిన అమృతలాల్ అర్థరాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి బాంబు విసిరాడు(bomb attack into girlfriend house). బాంబుకు డిటోనేటర్ ను కట్టి ఉండటంతో దాని ధాటికి ఇల్లు చాలావరకు ధ్వంసం అయింది.

Health Facts: ఏడాదికి కోటి మంది ఈ ఒక్క జబ్బు వల్లే చనిపోతారట.. 2050 కల్లా జరిగేది ఇదేనంటూ బిగ్ వార్నింగ్..!


ఈ బాంబు దాడిలో ఇంటి పైకప్పు ఎరిగిపోయింది. ఇంటి గోడలు, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. అర్థరాత్రి సమయంలో ఇల్లు పేలడంతో కుటుంబసభ్యులు భయపడిపోయారు. ఏం జరిగిందో అర్థం కాని అయోమయంలో కేకలు వేస్తూ ఇంట్లో నుండి బయటకు పరుగు తీశారు. అమృతలాల్ కు సదరు మహిళకు మధ్య ఉండే అక్రమ సంబంధం గురించి అప్పటివరకు ఎవరికీ తెలియదు. కానీ ఈ బాంబు పేలుడు సంఘటనతో విషయం బయటపడింది. రెండు కుటుంబాలలోనూ కలకలం రేగింది. సదరు మహిళ కొడుకు దోన్డా పోలిస్ స్టేషన్ లో బాంబు పేలుడు గురించి, దాని కారణం గురించి చెబుతూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Viral News: అమ్మ బాబోయ్.. ఎక్కువగా చదువుకుంటే ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు..!


Updated Date - 2023-10-18T10:03:05+05:30 IST