Wife: మీ భార్య గురించి ఈ నిజం తెలుసా..? అంటూ స్నేహితుడి భార్య చెప్పిన విషయాలు విని విస్తుపోయిన భర్త.. చివరకు జరిగింది ఇదీ..!

ABN , First Publish Date - 2023-06-02T18:01:04+05:30 IST

వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో.. ఇంకా లేదంటే కావాలనే ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారో తెలియదు గానీ.. చివరికి

Wife: మీ భార్య గురించి ఈ నిజం తెలుసా..? అంటూ స్నేహితుడి భార్య చెప్పిన విషయాలు విని విస్తుపోయిన భర్త.. చివరకు జరిగింది ఇదీ..!
wife

వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఆకర్షణో.. లేదంటే ప్రేమో.. ఇంకా లేదంటే కావాలనే ఇలా సంబంధాలు పెట్టుకుంటున్నారో తెలియదు గానీ.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రెండు కుటుంబాల్లో చిచ్చురేపింది. చివరికి ఒకరి తర్వాత మరొకరు హత్యకు గురయ్యారు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

గుజరాత్‌లోని సూరత్‌‌లో (gujarat surat) పాలన్‌పూర్ ప్రాంతానికి చెందిన రావత్‌, కల్పనకు ఏడాది క్రితం వివాహం జరిగింది. కౌశిక్ రావత్‌ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి అక్షయ్ అనే స్నేహితుడు (friend) ఉన్నాడు. ఇతడు వృత్తిరీత్యా ప్లంబర్. ఇదిలా ఉంటే అక్షయ్‌కు కూడా నెల క్రితం మీనా అనే యువతితో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత అక్షయ్‌ కూడా సూరత్‌కు వచ్చి స్నేహితుడైన రావత్ ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే రావత్‌కు స్నేహితుడి భార్య మీనాతో అక్రమ సంబంధం (illicit relationship) ఏర్పడింది. వీరి వ్యవహారం రావత్‌ భార్య కల్పన కంటపడింది. ఈ విషయమై రావత్‌‌ను అతని భార్య కల్పన నిలదీసింది. దీంతో నిత్యం వీరిమధ్య గొడవ జరుగుతుండేది. భర్త తీరు మార్చుకోకపోవడంతో చివరికి అక్షయ్‌కి అసలు విషయం చెప్పేసింది కల్పన. ఈ విషయమై సోమవారం అక్షయ్‌, మీనా గొడవపడటంతో మీనా పుట్టింటికి వెళ్లిపోయింది. అక్షయ్‌ కూడా భార్య వెంటే వెళ్లిపోయాడు.

ఇక అక్షయ్.. మీనా బయటకు వెళ్లగానే ఇంట్లోనే ఉన్న రావత్, కల్పన ఈ విషయమై మళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో అతను కల్పన గొంతు కోసి హత్య చేశాడు (Man kills wife). ఆ తర్వాత మృతదేహాన్ని ఉరి వేశాడు. అక్షయ్‌ తిరిగి వచ్చేటప్పటికి సీలింగ్‌కు వేలాడుతూ కల్పన మృతదేహం.. దాని పక్కనే కూర్చున్న రావత్‌ను చూశాడు. దీంతో భార్యను హత్య చేసి ఉంటాడని ఊహించి మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కల్పన మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి తాపీ నది ఆనకట్ట గోడ సమీపంలో ఉన్న పొదల్లో పారవేశారు. అనంతరం అక్షయ్‌.. రావత్‌ను కూడా తాపీ నది ఒడ్డుకు తీసుకెళ్లి రాయితో అతని తలపై మోది చంపేశాడు.

చౌక్ బజార్ పోలీసులు తాపీ నది ఆనకట్ట గోడ వద్ద ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే నది ఒడ్డున మరో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ జంట హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దర్యాప్తులో అక్షయ్‌ను నిందితుడిగా గుర్తించి సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో రావత్‌ను చంపినట్లు అక్షయ్‌ నేరం అంగీకరించాడు. రావత్.. తనను చంపడానికి ప్రయత్నించాడని.. తాను చనిపోతే మీనా తనదవుతుందని రావత్ బెదిరించాడని అక్షయ్ తెలిపాడు. అందుకోసమే అతని నుంచి కాపాడుకోవడం కోసమే రావత్‌ను చంపినట్లు అక్షయ్ వెల్లడించాడు.

ఇది కూడా చదవండి: Woman Kisses Snake: ఈ యువతి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోయింది.. పామును ముద్దు పెట్టుకున్న మరుక్షణంలోనే..!

Updated Date - 2023-06-02T18:01:04+05:30 IST