Crime News: నా కూతురికి ఒంట్లో బాలేదంటూ అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిందో తల్లి.. తెల్లారేసరికి షాకింగ్ ట్విస్ట్.. సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2023-04-18T20:03:06+05:30 IST

డాక్టరు ఇప్పుడు లేరు ఉదయం రమ్మని నర్సులు చెప్పారు. 'మాది పల్లెటూరు మేము ఇప్పుడు వెళ్లి ఉదయం రావాలంటే కష్టమవుతుంది, అందుకే పాపను అడ్మిట్ చేసుకోండి' అని ఆ మహిళ చెప్పింది. కానీ..

Crime News:  నా కూతురికి ఒంట్లో బాలేదంటూ అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిందో తల్లి.. తెల్లారేసరికి షాకింగ్ ట్విస్ట్.. సీసీ కెమెరాల్లో చెక్ చేస్తే..

'నా కూతురుకు ఆరోగ్యం బాగలేదు ట్రీట్మెంట్ కావాలి' అంటూ ఓ తల్లి తన 10ఏళ్ల కూతురుని తీసుకుని హాస్పిటల్ కు వచ్చింది. అది అర్దరాత్రి కావడంతో ఉదయం రమ్మని చెప్పారు. కానీ 'మేము మళ్ళీ ఉదయం రావాలంటే కష్టం, ఇప్పుడే అడ్మిట్ చేసుకోండి ఉదయం డాక్టర్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటాం' అని చెప్పారు. దీంతో ఆ పాపను అడ్మిట్ చేసుకున్నారు. కానీ తెల్లారేసరికల్లా వారు కనిపించలేదు.. ఏమి జరిగిందో అర్థం కాక సీసీకెమెరా(CC Camera) పుటేజీ పరిశీలించి ఆసుపత్రి సిబ్బంది మొత్తం షాక్ కు గురయ్యారు. అందరినీ కంగారులోకి నెట్టేసిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పంజాబ్(Punjab) రాష్ట్రం లుథియానా(Ludhiana)లో సివిల్ హాస్పిటల్(civil hospital) ఉంది. అర్దరాత్రి(mid night) సమయంలో ఈ హాస్పిటల్ కు ఓ మహిళ తన 10ఏళ్ళ కూతురుని(10 years daughter) ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చింది. డాక్టరు ఇప్పుడు లేరు ఉదయం రమ్మని నర్సులు చెప్పారు. 'మాది పల్లెటూరు మేము ఇప్పుడు వెళ్లి ఉదయం రావాలంటే కష్టమవుతుంది, అందుకే పాపను అడ్మిట్ చేసుకోండి' అని ఆ మహిళ చెప్పింది. అడ్మిట్ చేసుకుంటే హాస్పిటల్ కు బిల్లు చెల్లిస్తారు తమదేం పోయిందిలే అనుకుని వాళ్లు అడ్మిట్ చేసుకున్నారు. అయితే తెల్లారిన తరువాత ఆ మహిళ, ఆమె భర్త వారి కూతురు ముగ్గురు కనిపించలేదు. అదే సమయంలో ప్రసూతి వార్డులో మూడురోజుల కిందట మగబిడ్డ(baby boy)ను ప్రసవించిన మహిళ తన పక్కన బిడ్డ లేకపోవడంతో ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె దగ్గరకు వెళ్ళిన సిబ్బంది ఏమి జరిగిందని అడగగా బిడ్డ కనిపించడం లేదని చెప్పింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు పరిశీలించగా రాత్రి 3గంటల(3.AM) సమయంలో హాస్పిటల్ లో కూతురిని అడ్మిట్ చేసిన మహిళ ప్రసూతి వార్డులోకి వెళ్ళి బిడ్డను ఎత్తుకెళుతున్న దృశ్యం కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

baby.gif

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు ఆ ఏరియాలో సీసీకెమెరాను పరిశీలించగా బిడ్డను దొంగిలించిన వారు బైక్ మీద వెళ్ళడం కనిపించింది. బైక్ నెంబర్(bike number) ఆధారంగా బిడ్డను దొంగిలించిన 12గంటల్లోపే పోలీసులు వారిని పట్టుకున్నారు. బిడ్డను దొంగిలించిన మహిళ పేరు ప్రీతి అని, ఆమె ఓ ప్రైవేట్ క్లినిక్ లో నర్సుగా పనిచేస్తోందని తెలిసింది. ఆమె భర్త కూలి పని చేస్తుంటాడు. వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. బిడ్డను దొంగిలించి తెచ్చివ్వమని ఎవరో అడగగా ఆమె ఆ పనికి పాల్పడినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకుని తన తల్లికి అందించారు. బిడ్డను చూసి ఆ తల్లి షాక్ కు గురయ్యింది. మూడు రోజుల ఆ చిన్న బాబు నోటిలో బొబ్బలు కనిపించాయి. ఏం జరిగిందని పోలీసులు ప్రీతిని గట్టిగా అడగారు. పిల్లాడు ఆకలికి ఏడుస్తుంటే పాలు పోశానని అవి వేడిగా ఉండటం వల్ల బాబు నోటిలో బొబ్బలు వచ్చాయని ప్రీతి చెప్పింది. ఇది విన్న బాబు తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది. ప్రీతిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రీతిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Viral News: 48 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం.. హిజ్రాను వివాహం చేసుకుని ఊరందరికీ పెళ్లి విందు..!


Updated Date - 2023-04-18T20:03:06+05:30 IST