MegaStarChiranjeevi: బీజేపీ మంత్రి అన్నయ్యని ఇంటికొచ్చి కలిశారు. ఏమి జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-02-27T14:07:05+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సాంఘీక మాధ్యమం లో ఒక ట్వీట్ చేశారు. సెంట్రల్ ఐ&బి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (#AnuragThakur), చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి ని కలిశారు

MegaStarChiranjeevi: బీజేపీ మంత్రి అన్నయ్యని ఇంటికొచ్చి కలిశారు. ఏమి జరుగుతోంది?

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సాంఘీక మాధ్యమం లో ఒక ట్వీట్ చేశారు. సెంట్రల్ ఐ&బి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (#AnuragThakur), చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి ని కలిశారు.

మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదములు, అలాగే భారత చలన చిత్ర పరిశ్రమ గురించి మనమధ్య జరిగిన చర్చలు కూడా చాలా బాగున్నాయి అంటూ చిరంజీవి ఆ ట్వీట్ లో చెప్పారు. ఇంకొక నటుడు నాగార్జున (#AkkineniNagarjuna) కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు అని. ఈమధ్య కాలంలో ఇలా ఒక సెంట్రల్ మినిస్టర్, బీజేపీ కి చెందిన మంత్రి చిరంజీవి (#Chiranjeevi) ఇంటికి వచ్చి కలవటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ విషయాన్నే పరిశ్రమలో చాలామంది ఈ కలయిక గురించే మాట్లాడుకుంటున్నారు.

chiranjeevi-megastar1.jpg

అయితే ఈ చర్చలో నాగార్జున కూడా ఉండటం పరిశ్రమలో టాకింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే నాగార్జున (#AkkineniNagarjuna) మొదటి నుండీ ప్రధాని నరేంద్ర మోడీ (#NarendraModi) కి చాలా సపోర్ట్ గా వున్నాడు. అలాగే ప్రధాని చాలా సార్లు నాగార్జున కి ట్వీట్ చెయ్యడం, అలాగే కొన్ని సంవత్సరాల కిందట ప్రధాని మోడీ, మొట్ట మొదట టాలీవుడ్ నుండి నాగార్జునని గుజరాత్ (#Gujarat) కి తీసుకెళ్లి అక్కడ డెవలప్ మెంట్ ఎలా జరిగింది అన్న విషయం దగ్గరుండి చూపించటం చేశారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ మంత్రి అన్నయ్య చిరంజీవిని కలిసినపుడు, తమ్ముడు నాగార్జున కూడా అక్కడ ఉండటం కేవలం కాకతీయమని అనుకోవాలా, లేకా నాగార్జున కూడా కావాలని వచ్చారా అన్న విషయం చర్చగా మారింది. ఏమైనా కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి ఇంటికి వచ్చి భారత చలన చిత్ర పరిశ్రమ గురించి చర్చిండం ఒక మంచి పరిణామమే అని అంటున్నారు పరిశ్రమలో. పరిశ్రమ నుండి ఎవరు ఈ చర్చల్లో పాల్గొన్నారు అన్న విషయం బయటకి రాలేదు, కానీ అల్లు అరవింద్ ఫోటోలో వున్నారు కాబట్టి, అతను చర్చలో పాల్గొన్నారు అని అనుకోవాల్సి వస్తుంది.

Updated Date - 2023-02-27T14:07:06+05:30 IST